15 రోజులుగా కొనసాగుతున్న అనునిత్యం ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పిటిసి

Published: Monday November 14, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో  15వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని  ముత్యాలమ్మ పేట లో గల కాలనీ లో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  ,విస్తృతంగా పర్యటించారు ఉదయం 10 ‌గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. త్రాగునీరు ,డ్రైనేజీ, రహదారులు విద్యుత్ స్తంభాలు, ఏర్పాటు ప్రజలు జెడ్పిటిసి  దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడూ సమస్యలను త్వరగారితిన పూర్తి చేయాలని ఆమె అధికారులను కోరారు.
 పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారని, నియోజవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను  శ్రీ రేగా కాంతారావు  కృషితో , కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు, వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ప్రజల దగ్గరికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకు తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారి సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు, ప్రజా సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్తు కాలంలో , గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సోసైటి డైరెక్టర్ బిక్కసాని శ్రీను   మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం  జగదీష్ , సారపాక టౌన్ అధ్యక్షులు కునకంచి శ్రీను  ,సారపాక టౌన్  యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మి చైతన్య రెడ్డి,   మండల కార్మిక విభాగము, మర్రి సాంబిరెడ్డి,  బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉప అధ్యక్షుడు సట్టు అంజనేయులు ,  బిఆర్ స్ పార్టీ నాయకులు బెజ్జంకి కనక చారి , మాజీ ఎంపీటీసీ బిక్షపతి, మండల మహిళా అధ్యక్షురాలు లలిత,  నక్క రమాదేవి, మాజి   దాసరి వెంకటరమణ, ఆవుల విజయ , చుక్కపల్లి  బాలాజీ, దాసరి మోహన్, సాయిబాబు, కాకాని రాంబాబు, కర్రీ నాగేశ్వరరావు, కర్రీ కోటేశ్వరరావు,సుదిపాక ఈశ్వర్ రావు , కుమార్  హరీష్ సాయి, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..