దాన్యం తూకం లో మెాసం పై కేటీఆర్ కు ట్వీట్ . ....వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సివిల్ సప్

Published: Monday May 16, 2022
జన్నారం రూరల్, మే 15, ప్రజాపాలన: 
 
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కవ్వాల్ లో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రంలో మూడు కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని  ఆ గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతు కెటిఆర్ కు ట్వీట్  చేయడంతో  
జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్ డీఎం గోపాల్ అదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బస్తాకు మూడు కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని మంత్రి కేటీఆర్ కు తిరుపతి అనే రైతు ట్వీట్  చేయడం జరిగిందని అయన తెలిపారు. , మంచిర్యాల జిల్లా   కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేశారు, ఆయన వెంట సీఈఓ రాజన్న, లారీ కాంట్రాక్టర్ సతీష్ లు ఉన్నారు.