ఓటమి భయంతో బీజేపీ కొనుగోలు రాజకీయాలు

Published: Friday October 28, 2022
మధిర  అక్టోబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కొనుగోలు రాజకీయాలు చేస్తున్నారని టిఆర్ఎస్ మధిర పట్టణ మరియు మండల నాయకులు పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పెద్దలు కొనుగోలు చేయాలని చేసిన ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద టిఆర్ఎస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి నీచమైన రాజకీయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించబోరని, ఇలాంటి వాటిని తిప్పికొడతారని వారు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు చేసిన కుట్రలను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని దేశ ప్రజలు, రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ మధిర పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, బోయపాటి వెంకటేశ్వరరావు, బోనకల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, తాళ్లూరి హరీష్ బాబు, పిడికిటి సాంబ, ముత్తవరపు ప్యారీ, కొఠారి రాఘవరావు, జెవి రెడ్డి, గద్దల రాజా, ఆళ్ల నాగబాబు, పుల్లారెడ్డి, కపిలవాయి జగన్మోహన్ రావు, గద్దల స్వామి, అవుల రాము, జగన్నాధ చారి, అంగడాల గోపి, హరి కిరణ్ కాంత్, ఖాదర్, గద్దల శేషయ్య, దుభాసి ఏసు, గద్దల దేవదానం తదితరులు పాల్గొన్నారు.