లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ
Published: Thursday February 18, 2021
వెల్గటూర్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): వెల్గటూర్ మండల లయన్స్ క్లబ్ జిల్లా పూర్వపు గవర్నర్ ఎస్వీ తపాడియా జన్మదిన సంధర్బంగా జిల్లా సెంట్రల్ క్యాబినెట్ సభ్యులు ఎల్.ఎన్ కోదండరామ్ జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విశేష సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు రగ్గులను వితరణ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ క్లబ్ అధ్యక్షులు మద్ది మురళీధర్, జోన్ చైర్పర్సన్ సామ ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నోముల వెంకటరెడ్డి, సిరిపురం తిరుపతి, కోశాధికారి గట్ల రాజేంధర్, పిఆర్వో నక్క సురేష్,సభ్యులు తిప్పర్తి భూమయ్య, బండారి చంద్రమౌళి, బండమీది గోపి, సంకోజు నరేష్, రాజారాంపల్లి క్లబ్ కోశాధికారి సత్యనారాయణ, గ్రామపంచాయితీ కార్యదర్శి రాజేంధర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: