ప్రత్యామ్నాయ పంటకు ఎరువులు విత్తనాలు అందుబాటులో వుంచాలి

Published: Wednesday January 19, 2022
బిజేవైఎం మండల అద్యక్షుడు ముడుగు ప్రవీణ్
జన్నారం రూరల్ జనవరి 18 ప్రజాపాలన : యాసంగి సిజాన్లో  అవసరమైన  ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఎరువులు అందుబాటులో వుంచాలని బిజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ కోరారు. మంగళవారం విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలలో యాసంగి సిజాన్ ప్రత్యామ్నాయ పంటలకు రైతులు సిద్దమయారని తెలిపారు, రైతులు పంటలు వేయ్యాలంటే వారికి అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాల్సి ఉంటుదన్నారు, రైతులకు ఇబ్బంది కలగకుండా యాసంగి ప్రత్యామ్నాయ పంటలకు ఇబ్బంది కలుగకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని అయన కోరారు.