ఎంప్లాయిస్ యూనియన్ 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Tuesday June 15, 2021
మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : డిపో TS RTC ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసు వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ తిమ్మినేని రామారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడినారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికులందరికీ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో మధిర డిపో ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు నాగుల్ మీరా, సెక్రెటరీ ప్రదీప్ కుమార్, రీజియన్ నాయకులు రామచంద్రరావు(MRC Rao) వెంకటేశ్వర్లు (M v loo), శ్యాం బాబు, గాంధీ, J p Rao, పుచ్చ రమేష్, M గోపాల్ రావు, G కోటేష్, K P Rao, సరస్వతి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.