ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి *జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ

Published: Monday January 23, 2023

శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేశామని అన్నారు.  
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు.  ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని,  శని ఆదివారాలు క్యాంపులు ఉండవని  సీఎస్ తెలిపారు.  ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు.జిల్లాలలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో నిర్వహించిన 2 రోజులు క్యాంపులో 11 జిల్లాల పరిధిలో 53% పైగా కళ్ళద్దాల పంపిణీ/ఆర్డర్ అవసరం అయ్యాయని సీఎస్ తెలిపారు.
జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులకు,ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ  పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు.  జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని,  అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో 2 రోజుల్లో 17892 మందికి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించి 3959 మందికి రీడింగ్ కళ్ళద్దాలు అందించామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్  వేంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.