పశువుల అక్రమరవాణా పై పోలీసులకు సమాచారం ఇవ్వండి - జగిత్యాల డిఎస్పి ప్రకాష్

Published: Thursday June 30, 2022

రాయికల్, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ పట్టణ పోలీస్ స్టేషనలో బక్రీద్ పండుగ నేపధ్యంలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరు వర్గాల పెద్దలు, ప్రజలు హాజరైనారు. ఈ సమావేశంలో జగిత్యాల సబ్ డివిజన్ డీ.ఎస్పీ. ప్రకాష్  మాట్లాడుతూపశువుల అక్రమ రవాణా పై పోలీసులకు సమాచారం ఇవ్వండని, పశువుల రవాణాకు సంబంధించి అనవసరమైన పుకార్లు సృష్టించడం వాటిని ఇతరులకు షేర్ చేయడం,ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగాచేయడం  తగదని, పశువుల అక్రమరవాణాకు సంబంధించి ఏదైన సమాచారం తమకు తెలిస్తే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వాలని, చట్ట పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సబ్ డివిజన్ డీఎస్పీ ప్రకాష్,జగిత్యాలరూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్, రాయికల్ ఎస్సై  పబ్బకిరణ్ కుమార్ గౌడ్,మరియు  నాయకులు పాల్గొన్నారు.