స్వతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా 75 స్వాతంత్ర సమరయోధుల ఫోటో లతో కూడిన స్టాల్ ను తహశీల్దార్ మహేశ్వర్ ప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు 75 సమరయోధుల ఫోటో లను పరిచయము చెయ్యడం ద్వారా విద్యార్థులు వారిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతారని తెలిపారు ఇందుకు కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాసరెడ్డి ని ఆయన అభినందించారు,ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు పొనకంటి వెంకట్,ఉపసర్పంచ్ మంగిలిపెల్లి లక్ష్మణ్, కార్యదర్శి రాకేష్, ఎస్ఎంసీ , వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనకొండ చిన్న రాజన్న, ఎస్ఎంసీ సభ్యులు మీర గంగాధర్,నాయకులు దొంతుల తుకారాం, ప్రధాన ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,ఉపాద్యాయులు రాజేందర్,మమత,మురళి,ఇమ్మనుయెల్,ఇబ్రహీం,భాగ్యలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: