హెచ్ పి పెట్రోల్ బంకు ప్రారంభం
Published: Monday October 11, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుండి దండుమైలారం వెళ్లే రహదారి పక్కన హెచ్ పి పెట్రోల్ బంక్ నిర్మించారని అందరికీ అందుబాటులో ఉంటుందని, నాణ్యమైన పెట్రోల్ అందుతుందని వాహనదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంకు యజమాని చీమల జగన్నాథం, జడ్పిటిసి భూపతి గల మహిపాల్, ఎం పి పి కృపేష్, దండుమైలారం సర్పంచ్ రవణ మోని మల్లీశ్వరి జంగయ్య, బూడిద రామ్ రెడ్డి, దండుమైలారం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వాహనదారులు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: