మండుతున్న ఎండలు.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు
Published: Monday March 01, 2021
ఖమ్మం, ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. వేసవికాలం రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అదేవిధంగా మధిర మండలం సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా మధిర ఫిబ్రవరి చివరలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ఖమ్మం జిల్లాలోని మధిరలో 39.3 డిగ్రీల చొప్పున రికార్డు అయింది.
Share this on your social network: