కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన మచ్చా రఘుపతిరావు- రేణుక ..

Published: Wednesday July 13, 2022
పాలేరు జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి యసి బిసి  కాలనిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన మచ్చా రఘుపతిరావు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి లోని యస్ సి బిసి కాలనీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన మచ్చా రఘుపతిరావు. నేలకొండపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణలో భాగంగా నూతన కార్యాలయమును ప్రారంభించిన మచ్చా రఘుపతిరావు.యస్ సి బిసి కాలనీలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల అవసరాలకు నూతన కార్యాలయము ఉపయేగ పడాలని అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి బానుప్రసాద్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో సిపిఐ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతన కార్యాలయం లో నేలకొండపల్లి మండల సిపిఐ కార్యవర్గ సమావేశం కనకబండి శీతరాములు అధ్యక్షతన జరిగినది. ఆగష్టు 3 వ తేదీన సదాశివపురం గ్రామంలో నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల సిపిఐ కార్యవర్గ సభ్యులు భాగం నరసింహారావు, మారిశెట్టి వెంకటేశ్వరరావు,పాల్తయ శ్రీను, మచ్చా రేణుక, తాళ్లూరి శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area