జననేత సునీతమ్మ జన్మదిన వేడుక

Published: Friday November 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతమ్మ జన్మదినాన్ని అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని చెప్పిన అభిమానులు, పార్టీ నాయకుల అభిమానం ఆగలేదు. గురువారం ఉదయం నుంచే జనంలోకి వచ్చిన సునీతారెడ్డి రోజంతా కార్యకర్తలు, నాయకుల మధ్యనే గడిపారు. తాండూరులో ని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్, తాండూరు పట్టణం నుంచి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నపిల్లలతో కేక్ కోసి పుట్టిన రోజు జరుపుకున్నారు. సునీతమ్మ సైన్యం యువకులు జిల్లా ఆస్పత్రిలో రక్తదానం నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లాలోని జడ్పిటీసీలు, ఎంపీపీ లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా అధికారులు సునితమ్మకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలిపారు. మరోవైపు జిల్లాలోని పలు పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.