ఓకే ఇంట్లో ముగ్గురుకి కరోనా

Published: Thursday June 03, 2021
మున్నూరు కాపు రాష్ట్ర నిధి నుంచి ఆర్థిక సహాయం
పాలేరు, జూన్2 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో ఓకే ఇంట్లో ముగ్గురుకి కరోనా వచ్చినది. వీరిలో ఒకరు పువ్వాల్ల సత్యనారాయణ, చనిపోయినారు. మిగతా ఇద్దరు పువ్వాల్ల జయమ్మ, పువ్వాల్ల అజయ్ బాబు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని మల్లేపల్లి గ్రామ నివాసి అయిన వేనేపల్లి ధనలక్ష్మి, మున్నూరు కాపు పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావుకు ఫోన్ ద్వారా తెలియపరచినది. మారిశెట్టి వెంకటేశ్వరరావు, వెంటనే మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషొత్తంరావుకి తెలియ పర్చగా, పురుషొత్తంరావు  వెంటనే స్పందించి, పువ్వాల్ల అజయ్ బాబు కుటుంబానికి మున్నూరు కాపు రాష్ట్ర నిధి నుంచి, 5000/ వేల రూపాయలను పంపించినారు. అట్టి రూపాయలతో, మారిశెట్టి వెంకటేశ్వరరావు దంపతులు ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, 50కేజిల బియ్యం కొనుగోలు చేసి అజయ్ బాబుకుతుంభానికి అందజేసినారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు వేనేపల్లి హనుమంతురావు, మారిశెట్టి విజయదుర్గ, పువ్వాల్ల రేణుక, శ్రీను తదితరులు పాల్గొన్నారు.