నాటిన ప్రతీ మొక్క ను సంరక్షించాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday July 06, 2021

బెల్లంపల్లి, జూలై 5, ప్రజాపాలన ప్రతినిధి : ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం నాడు బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ భావి తరాలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అలాగే నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సత్యనారాయణ, ఎంపీపీ , భీమిని మండల తెరాస పార్టీ అధ్యక్షుడు నిరంజన్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, తదితర ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.