చౌదర్ పల్లి లో కొనసాగుతున్న ముమ్మరంగా కోవిడ్ టీకాలు

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు ముమ్మరంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు. అందులో భాగంగానే యాచారం మండలం చౌదర్ పల్లి గ్రామంలో సర్పంచ్ నాయిని నర్సింహ్మ రెడ్డి, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వందకు వందశాతం ప్రజలకు టీకాలు పూర్తి చేయాలనే సంకల్పంతో   వ్యాక్సినేషన్ చురుకుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ సుమారు వందమందికి పైగా గ్రామ ప్రజలకు టీకాలు వేశామని తెలిపారు. త్వరలోనే ప్రజలందరికీ టీకాలు పూర్తిచేస్తామని, గ్రామాన్ని  కరోనా రహిత గ్రామంగా చేయాలన్నదే ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూపరాణి, ఆశా వర్కర్లు అలివేలు, లక్ష్మమ్మ, పంచాయతీ సెక్రెటరీ వి.జోష్నా రెడ్డి, కారోబార్ లింగం తదితరులు పాల్గొన్నారు.