ఎస్సై అశోక్ రెడ్డి. చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ
Published: Wednesday June 02, 2021
పాలేరు, జూన్1, (ప్రజాపాలన ప్రతినిధి) : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేముల హజరత్తయ్య, నేలకొండపల్లి ఎస్సై జీ.ఆశోక్ రెడ్డి జన్మదిన సందర్భంగా చందమామ ఫౌండేషన్ సభ్యులకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందించారు. ప్రతి రోజు 150 మంది కోవిడ్ పేషంట్ల కు భోజనం, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అందిస్తున్న చందమామ ఫౌండేషన్ వారి సేవలను గుర్తించి వాసవి క్లబ్ గవర్నర్ రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎస్సై జీ.అశోర్రెడ్డి చేతుల మీదుగా అందించారు. 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకుల ను పౌండేషన్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు కొత్త రమేష్. తెల్లాకుల వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్. ఈవో రామ నరేష్. గ్రామ పెద్దలు. వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ దోసపాటి శేఖర్, పీ.వీ.నాగిరెడ్డి. జెర్రిపోతుల అంజని. కడియాల నగేష్, షరాబు పవన్. చందమాదు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: