టీయూడబ్ల్యు ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఘనంగా సన్మానం
Published: Wednesday June 15, 2022
భగవద్గీతలు ప్రదానం చేసిన ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ
రాయికల్, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజెయు) జగిత్యాల జిల్లా శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఐజెయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగునూరి ప్రదీప్ కుమార్ లను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దండె రాజేందర్, వేల్పుల స్వామి యాదవ్ లు ఘనంగా శాలువాతో సత్కరించి భగవద్గీతలను ప్రదానం చేసారు. నూతన కార్యవర్గానికి భగవద్గీతలు అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ బాధ్యలు చంద సత్యనారాయణ, నేరెళ్ళ శ్రీకాంత్, అన్యారంబట్ల సూర్యనారాయణ, సయీద్ పాషా, ఖదీర్, రాజేశం, రాజేందర్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: