ప్రతి ఒక్కరికి కరోనా జయించుటకు వ్యాక్సిన్ టీకాలు
Published: Tuesday April 27, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఉచిత కరోనా వ్యాక్సిన్ డోస్ వేసుకోవాలని కార్పొరేషన్ పసునూరి బిక్షపతి చారి పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి సోమవారం నాడు వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా జీవించుటకు ఉచిత టీకాలు వేయించుకోవాలని పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ కరోనా ను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు ఎలాంటి భయబ్రాంతులకు గురి కాకుండా నిర్భయంగా ధైర్యంగా వ్యాక్సిన్ టీకాలు వేయించుకొని డాక్టర్లు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలని కార్పొరేటర్ కోరారు.
Share this on your social network: