గొర్రెలు-మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్

Published: Thursday June 09, 2022

జగిత్యాల, జూన్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ జగిత్యాల జిల్లా వారి అధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామంలో గొర్రెలు - మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో   జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్ పాల్గొన్నారు. అనంతరం 1కోటి 75లక్షలతో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అద్యక్షులు బాల ముకుందం, రైతు బంధు సమితి సభ్యులు రాజిరెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా.నరేష్ , ఏసీ కార్పొరేషన్ ఈడి లక్ష్మీనారాయణ, వెటర్నరీ డాక్టర్ ప్రియాంక మరియు ఇతర ఆధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు