కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

Published: Thursday July 08, 2021
మధిర, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ తెలంగాణ PCC అధ్యక్షులుగా ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రమాణస్వీకారం చేయటంతో మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో పలు కూడళ్లలో బాణసంచా కాల్చి, ర్యాలీ నిర్వహించారు మరియు కాంగ్రెస్ పార్ట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ మాట్లాడుతూ. రాబోయే కాలంలో తెలంగాణలో అధికారం లోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని దానికి ముహూర్తం ఖరారు అయింది అని.. రేవంత్ రెడ్డి tpcc అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయటం తో అధికార పార్టీ వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి అని.. అన్నారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా, మధిర మున్సిపల్ కౌన్సిలర్లు మునుగోటి వెంకటేశ్వరరావు, కోన ధనినికుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, మాజీ సర్పంచులు కర్నాటి రామారావ, బొమ్మకంటి హరిబాబు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, మండల మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయేషా కమాల్... ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, జింకల కోటేశ్వరరావు, సూర్యదేవర కోటేశ్వరరావు, ఆవుల కిరణ్, ఆదురి శ్రీను మొదలుగువారు పాల్గొన్నారు...