క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

Published: Thursday August 18, 2022

మధిర  ఆగస్టు  17 ప్రజాపాలన ప్రతినిధి  మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం నాడు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత తహసిల్దార్ రాంబాబు కమిషనర్ అంబటి రమాదేవి ఎంపీడీవో కుడుముల విజయ భాస్కర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీవీఎం పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జోనల్ క్రీడలను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని, శరీర దృఢత్వానికి దోహదపడతాయని వారు అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని వారు కోరారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని వారు  కోరారు. ఈ కార్యక్రమంలో మధిర ఎర్రుపాలెం బోనకల్ వైరా మండలాలకు చెందిన పలు  ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.