రెడ్డిగూడెంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర

Published: Saturday August 06, 2022

తల్లాడ, ఆగస్టు 5 (ప్రజా పాలన న్యూస్) : తల్లాడ మండలంలోని రెడ్డిగూడెంకు చెందిన బద్ధం క్రిష్ణ రెడ్డి, తాళ్లూరి అజిత ఇటీవల మృతి చెందారు. శుక్రవారం వారి కుటుంబాలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపీపీ దొడ్డా శ్రీనివాస రావు, టి. ఆర్. యస్ మండల అధ్యక్షుడు వీరమోహన్ రెడ్డి, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ బద్ధం నిర్మల, టి. ఆర్. యస్ పట్టణ అధ్యక్షుడు జి. వి. ఆర్, టి. ఆర్. యస్ జోనల్ అధ్యక్షుడు బద్ధం. కోటిరెడ్డి, ఉపసర్పంచ్ వీరయ్య, సర్పంచ్ కోసూరి వెంకట నరసింహ రావు,టి. ఆర్. యస్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు దూపాటి. నరేష్ రాజు ఉన్నారు.