భాదిత కుటుంబాలను పరామర్శించిన రమేష్ రాథోడ్

Published: Tuesday December 27, 2022

జన్నారం, డిసెంబర్ 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోనీ  చింతగూడ, రోటి గూడ, తిమ్మాపూర్, గ్రామాల్లోని బాధిత కుటుంబాలను ఖానాపూర్ నియోజకవర్గ బిజెపి పార్టీ నేత రమేష్ రాథోడ్ పరమర్శించారు. సోమవారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన మంచిర్యాల జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అజ్మీర బద్రీ నాయక్ తండ్రి అజ్మీర శంకర్ నాయక్, రోటి గూడ గ్రామానికి చెందిన జన్నారం మండలం మోర్చా అధ్యక్షురాలు గాజుల సుగుణ భర్త గాజుల సత్తయ్య భరోసా కనిపిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల మరణించిన ఉప్పు బుచ్చయ్య కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న బల్లికొండ బుచ్చన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకన్న మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. జన్నారం మండల కేంద్రంలోని ఇటీవల మరణించిన వకల్ ఆయుర్వేదిక డాక్టర్ యూసుఫ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం కల్పించి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గోలిచంద్ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, నాయకులు మధు సుధన్ రావు, ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పు చంద్ర శేకర్, ఖానాపూర్ నియోజకవర్గ ఐటీ సెల్ కో కన్వీనర్ బూరగడ్డ జగన్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, మండల బిజెపి ఐటీ సెల్ కో కన్వీనర్ బూడ గంగాధర్ బీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆకుల శివ తపాలాపూర్ బూత్ అధ్యక్షుడు బండి రాజన్న బీజేపీ నాయకులు ముదేళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.