పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published: Tuesday June 14, 2022
జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య
 
మంచిర్యాల టౌన్, జూన్ 13, ప్రజాపాలన : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థ, హైదరాబాద్ నందు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, తల్లి ,తండ్రిని కోల్పోయిన బాలికల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లలో 70 శాతం తల్లిదండ్రులు కోల్పోయిన, తల్లి , తండ్రి కోల్పోయిన బాలికలకు కేటాయించడం జరిగిందని, వీరు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు అనాథ బాలికలకు అవసరం లేదు. మరణ ధృవీకరణ పత్రలు, బోనాఫైడ్ సర్టిఫికెట్లను కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారంనకు జత చేసి బాలరక్షా భవన్, పద్మావతి చెస్ట్ హాస్పిటల్ పైన, రెండవ అంతస్తు, యూనివర్సల్ బ్యాంక్ లైన్, మంచిర్యాల నందు ఈ నెల 18వ తేదీ లోగా అందజేయాలని, బాలికలకు ఉచిత విద్య, వనతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.