బెల్లంపల్లిలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

Published: Saturday August 27, 2022
 ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు
 
బెల్లంపల్లి ఆగస్టు 26 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో వివిధ పత్రికల్లోను, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బెల్లంపల్లి ఆర్ డి ఓ కె, శ్యామల దేవికి  స్థానిక ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతు  ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతు, సొంత ఇల్లు లేని వారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని , చాలీచాలని వేతనాలతో కొంతమంది, అసలే వేతనాలు లేక పనిచేస్తూ మరి కొంతమంది, అద్దె ఇళ్లలో తమ కుటుంబాలతో జీవిస్తూ అనేక అవస్థలు పడుతున్నారని ఆర్ డి ఓ కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జర్నలిస్టు లందరికి ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు.
 సానుకూలంగా స్పందించిన ఆర్ డి ఓ శ్యామలాదేవి వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపులపై జిల్లా కలెక్టర్ కు సమాచారం అందజేస్తానని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ కు సంబంధించిన పాత్రికేయులు,  ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area