కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం
Published: Friday July 08, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీకి చెందిన మేతరి శంకర్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే పార్టీ నిలబడుతుందని, వారి అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాటుపడుతుందన్నారు. కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు మరింత కష్టపడి మరోసారి టీఆర్ ఎస్ను అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, రంగారెడ్డి జిల్లా రైతుబంధు చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల అమరేందర్రెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, పుల్లగుర్రం విజయానంద్రెడ్డి, కొంతం యాదిరెడ్డి, జొన్నాడ వెంకటరెడ్డి, నల్లవెల్లి కార్తీక్, మస్కు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: