మంచినీళ్లు సమస్యకు శాశ్వత పరిష్కారం మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday June 28, 2022
మేడిపల్లి, జూన్27 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీళ్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ 
శ్రీసాయి నగర్ కాలనీ పోలీస్ క్వార్టర్స్  లో స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా  మిషన్ భగీరథ పైప్లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, జలమండలి మేనేజర్ రమ్యప్రియ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ  25వ డివిజన్లోని విహరిక,సాయి నగర్,సాయి నగర్ హిల్స్,క్రాంతి కాలనీ లలో అతి తొందరలో మంచినీళ్ల పైప్లన్ పనులు ప్రారంభించి, రానున్న రెండు మూడు మాసాల్లో రోజు విడిచి రోజు నీళ్లు అందించేలా చేస్తామని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ విజయపాల్ రెడ్డి, సాయినగర్ కాలనీ అధ్యక్షులు రవిందర్ చారి, కార్యదర్శి హరిందర్ యాదవ్,డివిజన్ సునిల్,కార్యదర్శిచంద్రశేఖర్,లక్ష్మీ,రాజేశ్వరి,ప్రభాకర్ చారి,సుదర్శన రెడ్డి,పున్నారెడ్డి, సత్యనారాయణ, నరేందర్,భాను,ప్రదీప్,శ్రీనివాస్ రెడ్డి, మధు,విజయ్, సంతోష్ రెడ్డి, మల్లరెడ్డి,రాజు,శ్రీనివాస్,యాదగిరి  పాల్గొన్నారు.