ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం మరోసారి పొంగిపొర్లిన వాగులు,వంకలు

Published: Friday October 07, 2022
 స్తంభించిన జనజీవనం, అక్టోబర్.6
 
 నవాబుపేట, ప్రజా పాలన ప్రతినిధి నవపేట మండలంలోని  గురువారం 
ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం 3 గంటల వరకు జోరుగా కురిసింది. వర్షం కారణంగా మరోసారి మండలంలోని చెరువులు ,కుంటలు అలుగులు పారాయి. వాగులు,వంకలు పొంగిపొర్లాయి. వరద నీరు రోడ్లపై నుండి పారింది.  నవాబుపేట మహబూబ్ నగర్  ప్రధాన రహదారిపై మండల కేంద్రానికి సమీపంలో గల తాళ్లవాగు 
నీరు రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహించింది.
దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం
 నుండి మధ్యాహ్నం  వరకు వర్షం ఎడతెరిపి లేకుండా కురియడంతో గ్రామీణ రోడ్లు బురద మయంగా  మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉండడం వల్ల ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకపోవడంతో గ్రామాలన్ని నిర్మానుష్యంగా కనిపించాయి.