ఎమ్మెల్సీ జయ సారధి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం

Published: Wednesday March 03, 2021

మధిర మార్చి 2 ప్రజాపాాలన ప్రతినిధి: వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం & సిపిఐ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో లో పలు విద్యా సంస్థల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా సీపీఎం టౌన్ కార్యదర్శి శీలం నరసింహారావు మాట్లాడుతూ:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష ఉద్యమాలతో పాటు చట్టసభల్లో ఉద్యోగుల, విద్యార్థి, యువజనుల రైతుల కార్మికుల మహిళల సమస్యల పై మాట్లాడగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్న వ్యక్తి జయ సారధి రెడ్డి అని సారధి రెడ్డి కి పట్టభద్రులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు, సత్యనారాయణ, సీపీఎం నాయకులు రాధాకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు...