ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కొందండ రెడ్డి కి శు

Published: Wednesday January 04, 2023
యాచారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి కోదండ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసంలో సాదరంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా ఉద్యమాలను పోలీసుల సహాయంతో అణచివేయాలని చూస్తున్నారని ఏ క్షణమైన తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని అందుకు సిద్ధంగా ఉండాలని ముదిరెడ్డి కోదండ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండ రెడ్డి సూచనలు సలహాలు ఆయన అనుభవం సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ మామ, దండెం రామ్ రెడ్డి, ఉప్పల భాస్కర్, గుప్తా కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.