ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోడాక్టరేట్ సాధించిన అధ్యాపకురాలికి
Published: Wednesday February 22, 2023
అభినందనలుమధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద కామర్స్ అధ్యాపకురాలు శ్రీమతి పూరేటి సుజాతకు డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ డాక్టర్ హరి ఓం పర్యవేక్షణలో ఆమె “భారతదేశంలోని కంపెనీల విలువ పెంచటంలో కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క పాత్ర ” అనే అంశంపై పరిశోధనాత్మక గ్రంథం సమర్పించారు. దీంతో జార్ఖండ్ రాష్ట్రంలోని రాధా గోవింద్ విశ్వవిద్యాలయం నుంచి శ్రీమతి పూరేటి సుజాతకు డాక్టరేట్ ప్రకటించగా ప్రిన్సిపాల్ ఏ ఎల్ ఎన్ శాస్త్రి , అధ్యాపకులు మంగళ వారం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: