వందన హాస్పిటల్ ని సందర్శించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Thursday August 19, 2021
మధిర, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : వందన హాస్పిటల్ ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో రోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అయితే ఎక్కువగా ఎర్రుపాలెం మండలం నుంచి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తో బాధపడుతున్న వారిని కలిశారు. డాక్టర్ అనిల్ మాట్లాడుతూ ఎక్కువగా ఎరుపాలెం మండలం నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని చెప్పారు. ఎక్కువగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎర్రుపాలెం ఎస్సీ కాలనీ లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్లు, వైద్య బృందం పాల్గొన్నారు
Share this on your social network: