వ్యాక్సినేషన్ కోసం బారులు తీరిన ప్రజలు
Published: Thursday July 01, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి రూరల్ 30వ తేదీ మధిరమండల పరిధిలోని మాటూరుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మధిర మండల ప్రజలే కాకుండా సరిహద్దు ప్రాంతాల ప్రజలు రావడంతో మాటూరుపేట ప్రభుత్వ ఆస్పటల్ దగ్గర జనాల రద్దీ ఎక్కువగా ఉంది. గంపలగూడెం మండలం నుండి ఎక్కువ మొత్తంలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు వస్తుండటంతో ఇబ్బంది ఎక్కువైనట్లు అధికారులు చెబుతున్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Share this on your social network: