మధిర పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం

Published: Thursday May 19, 2022
మధిర మే 18 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ కార్యాలయం లో బుధవారం నాడు కౌన్సిల్ సమావేశంలో లో మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత, అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం నందు ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు జరుగు పట్టణ ప్రగతి కార్యక్రమము సందర్భముగా దిశ నిర్దేశం చేయడం, ఏ ఏ వార్డులలో సమస్యలు ఉన్నాయి, వార్డులలో చెయ్యవలసిన అభివృద్ధి పనులు గుర్తించి పట్టణ ప్రగతిలో చేయించుకోవాలని చైర్ పర్సన్ సూచించినారు.ఈ సమావేశము నందు మునిసిపల్ కమీషనర్ రమాదేవి, మునిసిపల్ ఇంజనీర్ వై.నరేష్ రెడ్డి మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.