మధిర పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం
Published: Thursday May 19, 2022
మధిర మే 18 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ కార్యాలయం లో బుధవారం నాడు కౌన్సిల్ సమావేశంలో లో మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత, అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం నందు ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు జరుగు పట్టణ ప్రగతి కార్యక్రమము సందర్భముగా దిశ నిర్దేశం చేయడం, ఏ ఏ వార్డులలో సమస్యలు ఉన్నాయి, వార్డులలో చెయ్యవలసిన అభివృద్ధి పనులు గుర్తించి పట్టణ ప్రగతిలో చేయించుకోవాలని చైర్ పర్సన్ సూచించినారు.ఈ సమావేశము నందు మునిసిపల్ కమీషనర్ రమాదేవి, మునిసిపల్ ఇంజనీర్ వై.నరేష్ రెడ్డి మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: