చైత్ర కుటుంబానికి న్యాయం కావాలి
Published: Thursday September 16, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం పైడిమాడుగు గ్రామంల్లో మాదిగ సంక్షేమ సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సింగరేణి కాలనిలో 6 సంవత్సరల పసిపాపపై హత్యాచార, హత్య చేయబడిన చైత్రికు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్రంలో బలమైన ప్రభుత్వలు ఉండి కూడా దోషులకు సరైన శిక్ష విధించిలేకపోతున్నారు. పసిపాపలై, మహిళపై అత్యాచారలు రోజు రోజుకు పెరుగుతానే ఉన్నవి. మహిళలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వలు విఫలం అవుతున్నాయి అని హైదరాబాద్ లో జరిగినా సంఘటనా సంబంధించిన దోషికి మరణశిక్ష విధించాలని జై భీమ్ యూత్ సభ్యులు వినోద్, మనికంఠ సన్నీ, లక్ష్మణ్, మహేంధర్, వంశీ, ప్రమోద్ తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు విన్నపము తెలియజేసారు.
Share this on your social network: