గ్రామాలలో ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ ** జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు **

Published: Monday September 05, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలోని అప్ప పెళ్లి, మోతుగూడ గ్రామంలో శనివారం వృద్ధులకు, వికలాంగులకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా విడుదల చేసిన పింఛన్ కార్డుల పంపిణీ కి ముఖ్యఅతిదులుగా జెడ్పి చైర్ పర్సన్ కోవా లక్ష్మీ, జెడ్పిటిసి, అరిగెల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ కు అర్హులై కార్డ్స్ రానివారికి మంజూరయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, అప్ప పెళ్లి సర్పంచ్ బాబురావు, ఊరు కూడా మాజీ సర్పంచ్ సత్యనారాయణ, శ్రీశైలం, రామా గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.