యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం -యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గణపురం ప్రసాద్

Published: Monday January 23, 2023
 చేవెళ్ల నియోజకవర్గం:(ప్రజాపాలన)
యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు నవాబ్ పేట్ మండల కేంద్రం లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.మండలంలో ని వివిధ గ్రామాల్లో యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమాన్ని గూర్చి విశ్లేషించడం జరిగింది. దాదాపు 75% బూత్ లు  పూర్తయింది. మిగతా గ్రామాల్లో ఏ విధంగా చేయాలనే దాని గురించి చర్చించి మండల యువజన నాయకులకు తెలియజేయడం జరిగింది.పార్టీ కార్యక్రమాల లో పాల్గొన్నాని వారి ని  పని చేయని   పదవుల నుండి తీసివేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా అన్నారు.యువజన కాంగ్రెస్ నాయకులు ఆక్టివ్ గా పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు శివ ప్రసాద్, లక్ష్మణ్,శేకర్, ప్రధాన కార్యదర్శిలు పాండురంగారెడ్డి, ప్రసాద్ కార్యదర్శులు మల్కయ్య,రాజేష్, సోషల్ మీడియా కన్వీనర్ బాల్రాజ్,నవీన్ కుమార్,వెంకటేష్ శ్రీనివాస్,శివ,రాజు,విజయ్,అనిల్,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు...