*అన్నం పరబ్రహ్మ స్వరూపం*

Published: Friday October 28, 2022

మధిర రూరల్  అక్టోబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్ని దానాల కంటే అన్నదానం మిన్న బార్ అసోసియేషన్ నాయకులు జింకల రమేష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న వినాయకుడి గుడి వద్ద ఎర్రుపాలెం మండలం ములుగుమాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రామిశెట్టి సమత (మధిర కోర్టు ప్రభుత్వ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యం సతీమణి) జన్మదినాన్ని పురస్కరించుకొని  ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. అన్నదాన నిర్వహణ కమిటీ చైర్మన్ కోన జగదీష్ మాట్లాడుతూ అన్నదానాలకు ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుభ కార్యములకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా పేదల కోసం అన్నదానాలు చేయాలని ఆయన కోరారు. ప్రతి బుధవారం అన్నదానం చేసే దాతలు 9848455832 నెంబర్లో సంప్రదించవలసినదిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధిర సొసైటీ డైరెక్టర్ కోన వాసవి దాతలు పాల్గొన్నారు.