కాంట్రాక్టు కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వాలి టి, మనీ రామ్ సింగ్ డిమాండ్
Published: Wednesday September 28, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి:
సింగరేణి కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా, 12,500 రూపాయల దసరా అడ్వాన్స్ ను ఇవ్వాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి, మణి రామ్ సింగ్, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు ఆయన "ప్రజా పాలనా" ప్రతినిధితో మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్సుగా 25 వేలు ఇస్తుండగా వారితో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కనీసం 12,500 దసరా అడ్వాన్స్ గా చెల్లించి వాయిదాల రూపంలో రికవరీ చేసుకోవాలని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు కూడ బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా జరుపుకునే విధంగా అడ్వాన్స్ ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this on your social network: