దేశభక్తిని అంబేద్కర్ స్ఫూర్తిని రగిల్చిన చిన్నారులు
శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్
శంకరపట్నం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ కూడలి వద్ద కేశవపట్నం ఎస్సీ బీసీ కాలనీకి చెందిన చిన్నారులు అంబేద్కర్ ప్రతిమతో ర్యాలీగా తరలివచ్చి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ సూక్తులను చిన్నారులు నినాదాలు చేస్తూ యువకులకు స్ఫూర్తినింపారు. చిన్నారుల దేశభక్తిని, అంబేద్కర్ మీద అభిమానాన్ని ఇక్కడికి వచ్చిన నాయకులు కొనియాడారు. అనంతరం చిన్నారుల చేత కేక్ కటింగ్ నిర్వహించారు. నిష్కల్మషమైన మనసు నిండిన నేటి ఈ చిన్నారులే రేపటి దేశభక్తి కలిగిన పౌరులుగా నిలుస్తారని తెలపడానికి ఈ చిన్నారులే నిదర్శనం. ఈ కార్యక్రమంలో చిన్నారులు విష్ణు, నందిని, శాండీ, గోల్డీ ,ఆశ్రిత్, జున్ను, లడ్డు, ఆదిలక్ష్మి, శబరి, ఐశ్వర్య, అక్షయ, అక్షిత, డుడ్డు, మొదలగు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: