వరద బాధితులకోసం దుస్తులు సేకరణ

Published: Monday July 25, 2022
మధిర జూలై 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీ పరిధి ఆదివారం సాయంత్రం మున్సిపాలిటీ పరిధి  లో ఉన్న ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య నిర్వహిస్తూన్న మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ కు పలువురు దయార్ధ హృదయులు భద్రా చలం ఏరియా గిరిజన ప్రాంతం వరద బాధితులకుసహాయార్ధo వివిధ దాతలు స్వచందoగా ముందుకు వచ్చి తమ వద్ద ఉన్న అదనపు క్లాత్ బ్యాంక్ కు లంకా కొండయ్య బృందంనకు అందజేసినారు.
 ఇలా పాత బట్టలు వితరణ చేసిన దాతలు మధిర బ్రాహ్మణ సంఘం సభ్యులు సిరిపురం పురోహితులు శ్రీ అవ దానుల రామకృష్ణ శాస్త్రీ బనిగండ్లపాడు  హెచ్ఇఒ శ్రీ వి సదాశివరావు ప్రముఖ ఆర్య వైశ్య కుటుంభీకులు వ్యాపారస్తులు శ్రీ రాయపూడి  నాగభూషణం గారు, క్లాత్ మర్చంట్ వేముల శ్రీనివాస్, RTA ఏజెంట్ శ్రీ వీరభద్రం కమ్మ జన సంఘo సభ్యులు  విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ ములకలపల్లి మోహన్ రావు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఎర్రుపాలెం యస్కె షంషుద్దీన్ చలువాది నాగభూషణo గోపాలకృష్ణ ఇంకా అనేక మంది దాతలు వితరణ చేయగా ఈ బట్టలను కొండయ్య బృందం వరద బాధితులకు పంపించ నున్నట్లు కొండయ్య వివరించారు. నా సేవలు గుర్తించి పాత బట్టలు వితరణ చేసిన ప్రతిదాతకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు కొండయ్య వివరించారు.