అనాధ ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : అనాధ అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిసిరోహిత్, అశోక్, రఘు, హర్షిత్ లు స్పందించి తన వంతు సాయం. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో అభాగ్యులకు బంజారా మహిళ ఎన్ జి వో ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ... లాక్డౌన్ కారణంగా దాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారని పత్రికలలో వచ్చిన కథనలను చూసి బంజారా మహిళ ఎన్.జి.వో ఫౌండర్ & చైర్మన్ డా.ఆనంద్  వారి మిత్రులు రోహిత్, అశోక్, రఘు, హర్షితలు స్పందించి తమవంతు సహయంగా బియ్యం, నూనే, పప్పులు, చింతపండు, కారం, పసుపు తదితర నిత్యావసర సరుకులను మాతృదేవోభవ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరికి అందజేశారు. నిర్వాహకులు అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆశ్రమానికి నిత్యావసరసరుకులు అందజేసిన బంజారా, కృతజ్ఞతలు తెలిపారు.