దీక్షలు పూర్తిచేసుకుని శబరిమల యాత్రకై బయలుదేరిన స్వాములు.రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో 107 మం

Published: Friday December 16, 2022
దీక్షలు పూర్తిచేసుకుని  శబరిమల యాత్రకై బయలుదేరిన స్వాములు.రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో 107 మంది స్వాముల యాత్ర
బూర్గంపాడు (ప్రజా పాలన.)
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని అయ్యప్ప మాల ధారణ వేసుకున్న స్వాములు దీక్ష పూర్తి చేసుకొని గురువారం మధ్యాహ్నం శబరిమల యాత్రకు బయలుదేరారు. రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో.41 రోజులపాటు ప్రత్యేక శ్రద్ధలతో పూజలు నిర్వహించి అయ్యప్పను స్మరించుకుంటూ పవిత్రమైన దీక్షను పూర్తి చేసుకున్నారు. విజయవంతంగా దీక్షను ముగించుకొని శబరిమల తీర్థయాత్రలకు ఇరుముళ్ళు నెత్తినె ఎత్తుకొని గ్రామ పురవీధులలో పాదయాత్రగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములతో పాటు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.