8న నల్గొండ బియస్పీ బహిరంగ సభ విజయవంతం చెయ్యండి
Published: Friday August 06, 2021
జగిత్యాల, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి) : నల్గొండ జిల్లాలో ఈ నెల 8న జరిగే బహుజన సమాజ్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బియస్పీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చిర్ర శంకర్ పిలుపునిచ్చారు. గురువారం సారంగపూర్, రాయికల్, బీర్పూర్ గ్రామాల్లో పర్యటించి అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. నల్గొండ లో బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ఇంచార్జ్ రాంజీ గౌతమ్ ముఖ్య అతిధిగా, మాజీ ఐ. పి.ఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బియస్పీ లో చేరనున్నారని, బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, బియస్పీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి బిరుదులు లక్ష్మణ్, జిల్లా నాయకులు పవన్, నియోజకవర్గ అధ్యక్షులు బింగి నరేష్ లు పాల్గొన్నారు. బీర్పూర్ మండలంలో పలువురు బీఎస్పీలో చేరారు.
Share this on your social network: