దాడికి పాల్పడిన ఇద్దరు రిమాండ్.

Published: Wednesday January 25, 2023
లక్షేట్టిపేట, జనవరి 24, ప్రజాపాలన:
 
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని జెండా వెంకటాపూర్ కు చెందిన పెట్టెం రవి, బలరావుపేట్ చెందిన బగ్గని నరేష్ లపై ఊత్కూర్ చౌరస్తాలో దాడికి పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ఉదారం , గిలారాం లను మంగళవారం రిమాండ్ చేసినట్లు లక్షేట్టిపేట ఎసై ఎస్. లక్ష్మణ్ తెలిపారు.
 రాజస్తాన్ కు చెందిన ఉదారాం, గిలారాం అనే ఇద్దరు వ్యాపారులు గత కొన్ని సంవత్సరాల నుండి బస్టాండ్ ఏరియాలో పాల ప్యాకెట్లు, పాల పదార్థాల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈనెల 21న ఊత్కూర్ చౌరస్తాలో జర్సీ బాదాం మిల్కు డిస్ట్రిబ్యూషన్ విషయంలో జెండా వెంకటాపూర్ కు చెందిన పెట్టెం రవి, బలరావుపేట్ చెందిన బగ్గని నరేష్ అనే ఇద్దరు వ్యక్తులతో ఎజన్సీ విషయంలో గొడవ జరిగింది. ఈగొడవలో రవి , నరేష్ ల ను రాజస్థాన్ కు చెందిన పైన తెలిపిన వ్యాపారులు ఇద్దరు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ పెట్టెం రవి సోదరుడు పెట్టెం శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్ కొరకు కోర్టుకు  తరలించడం జరిగిందని ఆయన తెలిపారు.