*కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన* - ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Published: Thursday February 23, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 22, ప్రజాపాలన : మంచిర్యాల మున్సిపాలిటీ లోని 4, 18 వార్డ్ లలో  తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుదవారం సందర్శించి 
కంటి వెలుగు కార్యక్రమంలో ఏ విధంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు, నిర్వహించిన వారికి చికిత్సలు ఏ విధంగా అందుతున్నాయి, ఆపరేషన్లు అవసరమైన వారు ఎంతమంది ఉన్నారో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, అవసరమైనవారికి కంటి అద్దాలు పంపిణీ ఎలా జరుగుతుందో, కంటిచూపును యంత్రాల ద్వారా ఎలా నిర్ధారిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో  చైర్మన్ పల్లె భూమేష్, కాజా మియా, 4 వార్డ్ కౌన్సిలర్ మోతె సుజాత,18 వార్డ్ కౌన్సిలర్ హఫీజా బేగం తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.