రేణుక ఎల్లమ్మ ఆలయ నూతన కమిటీ ఎన్నిక
Published: Monday July 11, 2022
తల్లాడ, జులై 9 (ప్రజాపాలన న్యూస్):
మండల పరిధిలోని కేశవరం గ్రామంలో కొలువై ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి నూతన ఆలయ కమిటీ గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నిక నిర్వహించారు.
ఆలయ కమిటీ చైర్మన్ గా మన్నెపల్లి అప్పారావు, కార్యవర్గ సభ్యులుగా సాదం రమేష్, చావా తిరుమలరావు,కట్టా చిన్న వెంకటేశ్వరరావు, చుండూరి ప్రభాకర్ రావు, వనిగండ్ల పిచ్చయ్య,రావిలాల సురేష్, వనిగండ్ల చిన్న వెంకన్న నర్సయ్య, దేవరపల్లి వెంకటేశ్వరరావు,కట్టా నరసింహారావు,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సర్పంచ్ నూతన కమిటీకి శుభాకాంక్షలు చేస్తూ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి గ్రామం తరపున పంచాయతీ తరపున తమ వంతు సహకారం అందజేయగలమని, ఆలయ నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: