ఆలయ అభివృద్ధికి విరాళం *దామరగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా ఆధ్వర్యంలో*
Published: Saturday December 03, 2022
చేవెళ్ల నియోజకవర్గం: చేవెళ్ల :(ప్రజాపాలన)
చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి, ధూపదీప నైవేద్యాల ఖర్చుల కోసం గ్రామ సర్పంచ్ మలిపెద్ది వెంకటేశం గుప్తా ఆధ్వర్యంలో దామరగిద్ద వాస్తవ్యులు గణపురం బాలయ్య కుమారుల శేఖర్,మల్లేష్,వెంకటేష్ లు రూ. 61వేలు,అవుసుల ఆనంతాచారి కుమారులు ప్రశాంత్,రాజు రూ.12వేలు పూజరికి అందజేశారు.శ్రీ సీతారమచంద్ర స్వామి అశీషులు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని,ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పది కాలాలపాటు ఆనందంగా జీవించాలని భగవంతుని వేడుకుంటునట్లు చెప్పారు. విరాళం అందించిన దాతలను గ్రామ సర్పంచ్ వెంకటేశం గుప్తా శాలువలతో సన్మానించారు.ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా.ఉప సర్పంచ్ కుమార్.గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: