భక్తి శ్రద్ధలతో ఘనంగా మధిరలో మట్టల ఆదివారం కార్యక్రమం
Published: Monday April 03, 2023
మధిర ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి:మధిర ఎంప్లాయిస్ కాలనీ లోని బైబిల్ మిషన్ కాకాని తోట వారి మరనాత మహిమ మందిరంలో ఘనంగా మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్రైస్తవులు అందరూ పాల్గొని మట్టలు చేత పట్టుకుని వాటిని అందంగా అలంకరించి దేవాలయానికి తీసుకు వెళ్లారు.ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్.ఏసు పాదర్ మాట్లాడుతూ దావీదు తనయ హోసన్న యూదుల రాజా హోసన్న అంటూ పురవీధులలో ఏసుప్రభు వారిని ఊరేగిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.గుడ్ ఫ్రైడే కు ముందుగా మట్టలదివారం కార్యక్రమాన్ని ఉపవాస దీక్షతో 40 రోజులు క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పలు చర్చిలలో మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Share this on your social network: